న్యూస్ పవర్ , 22 సెప్టెంబర్ , ఇల్లంతకుంట : రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం ఓబులాపూర్ గ్రామంలో రెడ్డి సంఘం సమావేశం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా ఉమ్మెంతల మహిపాల్ రెడ్డి, ఉపాధ్యక్షులుగా పండుగు రాజిరెడ్డి, వికృతి లచ్చిరెడ్డి, ప్రధాన కార్యదర్శిగా ఎడ్ల శ్రీనివాస్ రెడ్డి, సంయుక్త కార్యదర్శి & కోశాధికారిగా పండుగు ఎల్లారెడ్డి, కార్యవర్గ సభ్యులుగా మడుపు ఎల్లారెడ్డి, గుజ్జుల నరసింహారెడ్డి, పాశం నారాయణరెడ్డి, పల్లె సత్తిరెడ్డి, పండుగు ముత్యం రెడ్డి గౌరవ అధ్యక్షులుగా పాశం ముత్యంరెడ్డి ఎన్నికయ్యారు. అనంతరం అధ్యక్షుడిగా ఎన్నికైన మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ రెడ్డి సంఘం భవనములో మరిన్ని శాశ్వత మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానన్నారు. రెడ్డి కులంలోని పేద విద్యార్థులకు ఆర్థికంగా చేయూత ఇచ్చి విద్యా కుసు మాలుగా తీర్చిదిద్దుతామన్నారు. ఐకమత్యంతో ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందే కార్యక్రమాలను సంఘపరంగా చేపడుదామని ఆయన పిలుపునిచ్చారు.
0 Comments