JSON Variables

విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న రాష్ట్ర ప్రభుత్వం

విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న రాష్ట్ర ప్రభుత్వం

న్యూస్ పవర్ , 22 సెప్టెంబర్ , ఇల్లంతకుంట :
ఇల్లంతకుంట మండలం గాలిపెళ్లి బీసీ వెల్ఫేర్ హాస్టల్ ని తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు పర్లపల్లి రవీందర్,మాజీ రాష్ట్ర అధికార ప్రతినిధి దామర సత్యం, ఆధ్వర్యంలో సందర్శించడం జరిగింది ఈ సందర్భంగా రవీందర్ ,సత్యం మాట్లాడుతూ రాష్ట్రంలో సంక్షేమ హాస్టళ్లను గాలికి వదిలేసింది అని విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతుందని,మౌలిక వసతుల కల్పన,స్టాఫ్ నియామకాల విషయంలో త్వరగా చర్యలని తీసుకుని విద్యార్థులకి న్యాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మాజీ పార్లమెంటు ఉపాధ్యక్షుడు అన్నాడి నరేందర్ రెడ్డి,మాజీ కరీంనగర్ టిఎన్ఎస్ఎఫ్ పార్లమెంటు అధ్యక్షుడు మోతె రాజిరెడ్డి,లీగల్ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మనోహర్ పటేల్,దొమ్మాటి గౌడ్,ఆరె మల్లేశం తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments