న్యూస్ పవర్ , 23 సెప్టెంబర్ , ఇల్లంతకుంట : 842 యోగా ఇన్స్ట్రక్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఆయూష్ శాఖ నుంచి రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్ జారీ అయింది. ఇందులో భాగంగా తెలంగాణలో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రుల్లో 842 యోగా ఇన్స్ట్రక్టర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలను పార్ట్ టైం పద్ధతిలో రిక్రూట్ చేయనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. మొత్తం 842 ఉద్యోగాలు ఉండగా… ఇందులో 421 పోస్టులను పురుష అభ్యర్థులతో భర్తీ చేస్తారు. మరో 421 పోస్టులకు ఫీమేల్ అభ్యర్థులను ఎంపిక చేస్తారు. సెషన్ల వారీగా విధులను నిర్వర్తించాల్సి ఉంటుంది. ప్రతి సెషన్ కూడా గంటసేపు ఉంటుంది. ఒక్కో సెషన్కు రూ.250 చొప్పున రెమ్యునరేషన్ చెలిస్తారు. అంటే పురుష యోగా ఇన్స్ట్రక్టర్లుకు నెలకు రూ. 8వేల వరకు, ఫీమేల్ యోగా ఇన్స్ట్రక్టర్లు నెలకు రూ. 5వేల వరకు పొందవచ్చు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను https://ayush.telangana.gov.in/ వెబ్ సైట్ లో చూడొచ్చు. తెలంగాణలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో యోగా ఇన్స్ట్రక్టర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా 842 యోగా ఇన్స్ట్రక్టర్ పోస్టులను రిక్రూట్ చేయనుంది. పార్ట్ టైం విధానంలో వీటిని భర్తీ చేస్తున్నట్లు ప్రకటించింది. యోగా ఇన్స్ట్రక్టర్లు(పురుష) నెలకు కనీసం 32 యోగా సెషన్లకు అటెండ్ కావాల్సి ఉంటంది. ఇక ఫీమేల్ యోగా ఇన్స్ట్రక్టర్లు నెలకు కనీసం 20 యోగా సెషన్లకు హాజరుకావాలని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ఈ పోస్టులను కేవలం విద్యా అర్హతలు, ఇంటర్వూ ఆధారంగా భర్తీ చేస్తారు. జగిత్యాల,పెద్దపల్లి,రాజన్న సిరిసిల్ల కరీంనగర్, నాలుగు జిల్లాల కలిపి కరీంనగర్ జిల్లాలోని రాంనగర్ ఆయుష్ ఆయుర్వేదిక్ కేంద్రాల్లో ఇంటర్వూలు ఉంటాయి. తేది సెప్టెంబర్ 28 శనివారం రోజున చేపడుతారు.
0 Comments