JSON Variables

ముస్కాన్ పేటలో రైతులకు అవగాహన సదస్సు

ముస్కాన్ పేటలో రైతులకు అవగాహన సదస్సు
 న్యూస్ పవర్ , 28 మే , ఇల్లంతకుంట :
విత్తనాల కొనుగోలు విషయంలో రైతులు  జాగ్రత్త తీసుకోవాలని మండల వ్యవసాయ అధికారి సురేష్ రెడ్డి అన్నారు ముస్కాన్ పేట గ్రామంలో ఏర్పాటు చేసిన  అవగాహన సదస్సులు ఆయన మాట్లాడుతూ 
 లూజుగా ఉన్న సంచులలో ఉన్న విత్తనాలను కొనుగోలు చేయరాదని , రైతులు విత్తనాలు కొనుగోలు చేసిన దుకాణం నుంచి రసీదులు తప్పనిసరిగా తీసుకోవాలన్నారు , విత్తన ప్యాకెట్ మరియు బిల్లును పంటకాలం పూర్తయ్యే వరకు భద్రంగా దాచుకోవాలనీ,
 వ్యవసాయ శాఖ ద్వారా గుర్తింపు పొందిన అధికృత డీలర్ల దగ్గర మాత్రమే విత్తనాలు కొనుగోలు చేయాలనీ
 కొనుగోలు రసీదు మీద విత్తన కంపెనీ పేరు దాని రకం బ్యాచ్ నెంబర్ ప్లాట్ నెంబర్ రేటు తయారైన తేదీ ముగిసిన తేదీ వంటివి ఉన్నాయా లేదా సరిచూసుకోవాలని సూచించడం జరిగింది. ఈ కార్యక్రమంలో  వ్యవసాయ విస్తరణ అధికారి గంగా  గ్రామ కార్యదర్శి రాజయ్య  కారోబార్ ప్రకాష్ రైతులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments