JSON Variables

చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు

చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు
జనం న్యూస్ , 19 ఫిబ్రవరి , ఇల్లంతకుంట :
విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఇల్లంతకుంట మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో శ్రీ చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు అత్యంత ఘనంగా జరుపుకోవడం జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఒగ్గు నర్సయ్య యాదవ్ ఎంపీటీసీ  మాట్లాడుతూ శివాజీ  మొగలులను ఓడించి హిందూ సామ్రాజ్యాన్ని ఏర్పాటుచేసారని ప్రతి పౌరుడు శివాజీ ఆలోచనలతో ఎదగాలని అన్నారు. విశ్వహిందూ పరిషత్ మండల అధ్యక్షుడు ఎగుర్ల శ్రీనివాస్  మాట్లాడుతూ ప్రతి ఇంటిలో ఒక శివాజీ ఉండాలని జీజియా భాయి శివాజీకి తన చిన్నతనం నుండే దేశభక్తిని పోరాట ప్రతిభను చెప్పుతూ పెంచినందువలన ఈరోజు మన అందరికీ ఆదర్శప్రాయుడయ్యాడు, అలాగే ప్రతి ఇంటిలో ఉండే తల్లులు వారి పిల్లలకి దేశభక్తిని చెబుతూ పెంచాలని కోరారు. వచ్చిన అతిరథ మహారదులు హిందూ బంధువులు అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ జగన్మోహన్ రావు బాలరాజు  రాజేష్ శర్మ పంతులు బజరంగ్దళ్ మండల అధ్యక్షుడు ఏనుగుల శ్రీనివాస్  వివేకానంద సేవ సమితి అధ్యక్షుడు మామిడి పరుశురాం  రామ్ సేటు,ఎం రాజు, కే కిషన్, రమేష్ సింగ్, బత్తిని అంజన్న,రాజేల్లం,సత్యనారాయణ , శ్రీహరి, విజయ్, శ్రీనివాస్,వేంకటేశం, సాయి, ఆకాష్, రాకేష్, మధు  పాల్గొన్నారు.

Post a Comment

0 Comments