JSON Variables

మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవు_ఎస్ఐ డి.సుధాకర్


మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు  తప్పవు_ఎస్ఐ డి.సుధాకర్

• మద్యం సేవించి వాహనాలు నడిపిన ముగ్గురిపై కేసు నమోదు

న్యూస్ పవర్ , 4 అక్టోబర్ , ఇల్లంతకుంట : 
మద్యం సేవించి వాహనాలు నడిపితె కఠిన చర్యలు  తప్పవని ఇల్లంతకుంట ఎస్ఐ డి.సుధాకర్ హెచ్చరించారు.
బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించిన చోటే నేరాలు ఎక్కువ జరుగుతున్నాయని తద్వారా సమాజానికి కీడు జరుగుతుందని ఆయన అన్నారు. ఈరోజు కరీంనగర్ రోడ్డులో పోత్తుర్ బ్రిడ్జి వద్ద వాహనాల తనిఖీలు చేపట్టగా మద్యం సేవించి వాహనాలు నడిపిన ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేయడం జరిగిందని, అలాగే రోడ్లపై సరైన పత్రాలు లేకుండా వాహనాలు నడిపిన మరియు  ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనాల పైన జరిమానా విధించడం జరిగిందని ఆయన అన్నారు
ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నిబంధనలు పాటించి రోడ్డు ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు. వాహనాల తనిఖీలలో ఏఎస్సై సంజీవరావు, కానిస్టేబుల్ లు తిరుపతి, మధు, జీవన్ లు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments