JSON Variables

బైపాస్ రోడ్డుకు భూమి పూజ చేసిన ఎంపీపీ రమణారెడ్డి

 బైపాస్ రోడ్డుకు భూమి పూజ చేసిన ఎంపీపీ రమణారెడ్డి

న్యూస్ పవర్ , 2 జూన్ , ఇల్లంతకుంట :
స్వచ్ఛందంగా బైపాస్ రోడ్డు ఏర్పాటు కోసం రైతులు భూములు ఇవ్వడం అభినందనీయమని, ఇల్లంతకుంట  ఎంపీపీ వుట్కూరి వెంకటరమణారెడ్డి అన్నారు. ఇల్లంతకుంట మండల కేంద్రంలో శుక్రవారం సింగిల్  విండో కార్యాలయం ముందు నుండి రహీంఖాన్ పేటకు వెళ్లే బైపాస్ రహదారిని ఆయన భూమి పూజ చేసి ప్రారంభించారు. ఈజీఎస్ ద్వారా భూమి చదును చేసి రోడ్డు వేయడం జరుగుతుందని, త్వరితగతిన పనులు పూర్తి చేయాలని సిబ్బందిని ఆదేశించారు. బైపాస్ రోడ్డు నిర్మాణాల ద్వారా భూముల విలువ పెరుగుతుందని ,రవాణా సులభతరంగా మారుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో మిర్జా, సర్పంచ్ కూనబోయిన భాగ్యలక్ష్మి బాలరాజు ,ఎంపీటీసీ ఒగ్గు నరసయ్య యాదవ్ ,వార్డు సభ్యులు ,భూములు అందించిన రైతులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.


Post a Comment

0 Comments