JSON Variables

రైతుల పట్ల చిత్తశుద్ధి లేని ప్రభుత్వము

రైతుల పట్ల చిత్తశుద్ధి లేని ప్రభుత్వము

న్యూస్ పవర్ , 2 జూన్ , ఇల్లంతకుంట :
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం కాంగ్రెస్ పార్టీ నాయకుడు పసుల వెంకటి మాట్లాడుతూ
దశాబ్దా ఉత్సవాలని మరలో కొత్త రాగం అందుకున్న కల్వకుంట్ల చంద్రశేఖర రావు  మీకు రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఆరుగాలం కష్టం చేసి పండించిన పంటను ఐకెపి సెంటర్లలో రైతు వేదికల దగ్గర ఉన్నాయి అట్టి రైతుల బాధలు మీకు తెలిసిన వ్యక్తి అయితే వెంటనే ఆ ధాన్యాన్ని తరలించే ఏర్పాటు చేయాలని ఈ రైతులు ఎంత కష్టపడుతున్నారో మీకు తెలియడం లేదా నీవు రైతు బిడ్డని చెప్పుకోవడమే తప్ప రైతులకు చేసిన పనులు అయితే ఏమీ లేవు ఒక 5000 రూపాయలురైతుబంధు ఇస్తున్న అని చెప్పుకోవడం తప్ప రైతు బీమా లేదు ఫసల్ బీమా లేదు రైతులకు సబ్సిడీ లేదు రుణమాఫీ చేస్తానని రుణమాఫీ లేదు పంట నష్టపరిహారం లేదు రైతుకు మద్దతు ధర లేదు కిసాన్ క్రెడిట్ కార్డు లేవు సబ్సిడీపై యంత్రాలు లేవు ఇవన్నీ తీసేసిన కేసిఆర్  రైతులకు నేను ఏమో మేలు చేస్తున్న అని గొప్పలు చెప్పుకోవడం తప్ప మీరు మీ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వముగా మిగిలిపోతుంది తప్ప రైతులను నట్టేట ముంచిన ప్రభుత్వం ఏదైనా ఉన్నది అంటే అది బిఆర్ఎస్ ప్రభుత్వమే అది చెప్పక తప్పదుఈ రోజు ఇల్లంతకుంట మండలంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం డైరెక్టర్లు 11 మంది ప్రభుత్వము దశాబ్ద ఉత్సవాలను జరుపాలని పిలుపునిస్తే డైరెక్టర్లు ముక్కుమూడిగా బహిష్కరించారు అంటే మీ ప్రభుత్వం చేతకాని తనానికి నిదర్శనంగా కనబడుతుంది ప్రజల చేత ఎన్నుకోబడిన డైరెక్టర్లు మీ ప్రభుత్వం పై వ్యతిరేక గల వినిపిస్తుంటే మీరు రైతులకు ఎంతవరకు చేస్తారు అనేది ఇది నిదర్శనం ప్రభుత్వానికి ఇకనైనా సిద్ధ శుద్ధి ఉంటే వెంటనే రైతుల దగ్గర ఉన్నటువంటి ధాన్యాన్ని మీరు కొనుగోలు చేసి తొందరలో తరలించాలని డిమాండ్ చేస్తున్నాము అన్నారు.

Post a Comment

0 Comments