JSON Variables

లారీల కొరతను నియంత్రించాలి

లారీల కొరతను నియంత్రించాలి
జనం న్యూస్ , 1 జూన్ , ఇల్లంతకుంట :
ఇల్లంతకుంట మండలంలోని వరి ధాన్యం కొనుగోలు వేగవంతం చేసి, అధికారులు, ప్రజాప్రతినిధులు, లారీల కొరత లేకుండా చూడాలని బీజేపీ రాష్ట్ర నాయకులు మ్యాకల మల్లేశం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సదర్భంగా మల్లేశం మాట్లాడుతూ రైతులు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో పోసి నెలలు గడుస్తున్న ఇప్పటి వరకు కూడా కొనుగోలు ప్రక్రియ పూర్తి కాలేదని, మరోవైపు కాంట వేసిన ధాన్యం బస్తాలను తరలించేందుకు లారీలు రాక రైతులు తీవ్ర ఆందోళనకు గురి అవుతున్నారని అన్నారు. మరోవైపు ప్రతి రోజు రైతులు వడ్ల కొనుగోలు వేగవంతం చేయాలని ధర్నాలు చేసిన అధికారులకు, ప్రజాప్రతినిధులకు చీమ కుట్టినట్లు కూడా లేదని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి కొనుగోల్లు వేగవంతం చేసి, లారుల కొరత లేకుండా చూడాలని డిమాండ్ చేశారు.

Post a Comment

0 Comments