యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి
న్యూస్ పవర్ , 27 అక్టోబర్ , ఇల్లంతకుంట :
ఇల్లంతకుంట మండలం వెంకట్రావు పల్లె, గొల్లపల్లి గ్రామాలలో ప్రజలకు పోలీస్ కళాబృందం ఆధ్వర్యంలో మూఢనమ్మకాలు, మహిళలపై అత్యచారాలు, వేధింపులు, డయల్100, బాణామతి, సైబర్ నేరాలు, గల్ఫ్ ఏజెంట్లు, యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని , ట్రాఫిక్ నియమ నిబంధనలు తదితర అంశాలపై కళాజాత బృందం అవగాహన కల్పించింది. ఈ సందర్బంగా ఎస్సై మామిడి మహేందర్ మాట్లాడుతూ సైబర్ నేరాలు, ఈవ్ టీజింగ్, సీసీ కెమెరాల ప్రాధాన్యత, మహిళలు-చిన్నారుల రక్షణ, సంబంధిత చట్టాలపై అవగాహన కల్పించారు. మండలంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఎప్పటికప్పుడు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నామని, అపరిచిత వ్యక్తులు, అనుమానిత వ్యక్తులు కనిపిస్తే డయల్ 100కు ఫోన్ చేయాలని సూచించారు.
0 Comments