గ్రామపంచాయతీ సిబ్బంది సేవలు మరువలేనివి
- ఎంపిటిసి వొగ్గునర్సయ్యయాదవ్
న్యూస్ పవర్, 4 అక్టోబర్, ఇల్లంతకుంట :
కరోన కష్టకాలంలో గ్రామపంచాయతీ కార్యాలయ సిబ్బంది ప్రాణాలకు తెగించి చేసిన సేవలు మరువలేనివని ఇల్లంతకుంట ఎంపిటిసి వొగ్గునర్సయ్య యాదవ్ అన్నారు, ఇల్లంతకుంట గ్రామపంచాయతీ కార్యాలయ సఫాయి , సిబ్బందికి సద్గుల బతుకమ్మ, దసర పండుగను పురస్కరించుకుని సన్మాణం చేసిన ఎంపిటిసి సభ్యడు వొగ్గు నర్సయ్య యాదవ్ , అనంతరం ఒక్కోక్కరికి రూ.1000 లను అందజేశారు. మొత్తం 15 మంది సిబ్బందికి. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు మామిడి తిరుపతి, గడ్డం రమారవీందర్ రెడ్డి, తిప్పారపు శ్రీనివాస్ , ఎర్రోజు చంధ్రశేఖర్, కల్యాణం నర్సయ్య, వొగ్గు శివ, భానూ, నవీన్ పాల్గొన్నారు.
0 Comments