TS UTF మండల కమిటీ ఎన్నిక
మంచిర్యాల: తాండూర్ మండలం బోయపల్లి పాఠశాలలో శనివారం టీఎస్ యూటీఎఫ్ జిల్లా బాద్యులు రాథోడ్ దిలీప్, చక్రపాణి ముఖ్య అతిధులు హాజరై మాట్లాడుతూ
ఉపాధ్యాయుల జిల్లాల కేటాయింపు సీనియారిటీ ప్రాతిపదికన కాకుండా స్థానికత ఆధారంగా కేటాయించాలని, లేదంటే ఉపాధ్యాయులు స్థానికత ను కోల్పోయి చాలా నష్టపోయే ప్రమాదం ఉందని అన్నారు.
టిఎస్ యూటీఎఫ్ మండల మహా సభ నూతన అధ్యక్షుడిగా దుర్గం శివానంద్,ప్రధాన కార్యదర్శిగా జి. సంపత్ ఏకగ్రీవంగా ఎన్నికైయ్యారు.
ఉఫాధ్యక్షులుగా దేవదాస్, మేరీ సుజాత, కోశాధికారిగా ప్రసాద్ రావు, కార్యదర్శులుగా సుధాకర్ ,కవిత ,చంద్రశేఖర్ , జి .పద్మావతి ,గోపి జిల్లా కౌన్సిలర్లుగా ప్రకాష్, భారత్ సాంస్కృతిక విభాగం ఖగపతిగా ఎన్నుకున్నట్లు మండల అధ్యక్షుడు శివనంద్ ఒక ప్రకటనలో తెలిపారు..
0 Comments