JSON Variables

బాయిజమ్మసాయిసేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదానం, దుప్పట్లు పంపిణీ

బాయిజమ్మసాయిసేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదానం, దుప్పట్లు పంపిణీ
- దత్త జయంతి సందర్భంగా సేవా కార్యక్రమాలు
- సేవే పరమావధిగా పాల్గొన్న ట్రస్టు సభ్యులు, సేవకులు

మంచిర్యాల జిల్లా//బెల్లంపల్లి:  బాయిజమ్మసాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో దత్త జయంతిని పురస్కరించుకొని శనివారం బెల్లంపల్లి, తాండూర్, రేచిని బారెపల్లి తదితర ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు చేపట్టారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో చేపడుతున్న నిత్య అన్నదాన కార్యక్రమమే కాకుండా దత్త జయంతి నేపథ్యంలో ప్రత్యేక సేవలను అందించారు.
పలుచోట్ల అన్నదానం
దత్త జయంతిని పురస్కరించుకొని బాయిజమ్మసాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో బెల్లంపల్లి నియోజకవర్గంలోని  తాండూర్ మండలం, రేచిని గ్రామపంచాయతీలో బారేపల్లి గ్రామాoల్లో వృద్ధులకు  అన్నదానం చేపట్టారు.  . తమ కడుపు నింపిన ట్రస్ట్ వారికి ఈ సందర్భంగా వారు కృతజ్ఞతలు వ్యక్తం చేశారు.
 దుప్పట్లు పంపిణీ
బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో శనివారం అన్నదానం తోపాటు చలికాలం నేపథ్యంలో వృద్దులకు  దుప్పట్లను అందజేశారు. పడిపోతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో చలికి వారు ఇబ్బంది పడకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా దుప్పట్లు అందుకున్నవారు ఆనందం వ్యక్తం చేశారు.
సేవే మార్గంగా ముందుకెళ్తున్నాం*ముందుకెళ్తున్నా
బాయిజమ్మసాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవే మార్గంగా అనేక సేవా కార్యక్రమాలు చేపడుతూ ముందుకు వెళ్తున్నామని ట్రస్ట్ వ్యవస్థాపకులు కాంపల్లి రాజేశ్వరిశంకర్ తెలిపారు. ఆకలితో ఉన్న వారికి అన్నదానం చేస్తూ అతిథిగా సత్కరిస్తున్నామని పేర్కొన్నారు. ట్రస్టు ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలకు సహకరిస్తున్న వారికి ధన్యవాదాలు తెలిపారు. అన్నార్థులు, అనాధలకు సహాయం అందించాలనుకునేవారు తమను సంప్రదించవచ్చని ఈ సందర్భంగా విన్నవించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ మేనేజర్ బొద్దున సతీష్,జక్కం నాగమణితిరుపతి సభ్యులు, సేవకులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments