JSON Variables

జర్నలిస్టుల సమస్యల పై పొంగులేటి కి వినతి పత్రం*

*జర్నలిస్టుల సమస్యల పై పొంగులేటి కి వినతి పత్రం*

 మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కి వినతి పత్రం 

 న్యూస్ పవర్. బొల్లం సాయిరెడ్డి. రిపోర్టార్ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానని హామీ
.జర్నలిస్టుల సమస్యలు పై ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ని కలిసి వినతి పత్రం ఇచ్చిన డెమోక్రటిక్ జర్నలిస్టు ఫెడరేషన్ యూనియన్  ఉమ్మడి ఖమ్మం జిల్లా.అధ్యక్షుడు యరమల  కిషోర్ రెడ్డి.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్రిడేషన్ కార్డు లేని జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి వినతి పత్రంలో అక్రిడేషన్ కార్డు తో సంబంధం లేకుండా వర్కింగ్ జర్నలిస్టు లకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని అలాగే ప్రైవేటు వైద్యశాలలో ఉచిత వైద్యం అందేలా చూడాలని ప్రైవేట్ పాఠశాలలో   అక్రిడేషన్ కార్డు కు సంబంధం లేకుండా పాత్రికేయుల పిల్లలకు ఫీజు రాయితీ ప్రభుత్వమే భరించాలని వర్కింగ్ జర్నలిస్టులకు ఉచితంగా ఆర్టీసీ బస్సు రైల్వే రవాణా సౌకర్యం కల్పించాలని మరియు ప్రమాదవశాత్తు విధి నిర్వహణలో మరణించిన జర్నలిస్టు కుటుంబాలకు 50 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని విలేకర్ల పై సరైన కారణాలు లేకుండా అక్రమ కేసు కుండా చూడాలని విన్నవించారు ఈ సందర్భంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ విలేకర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని జిల్లాలో విలేకర్ల కి అండగా ఉంటానని హామీ ఇచ్చారు

Post a Comment

0 Comments