JSON Variables

బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదానం

బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదానం
న్యూస్ పవర్ రిపోట్టర్ సాయిరాం

*బెల్లంపల్లి:* బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ ద్వారా దత్తాత్రేయ ట్రేడర్స్ అధినేత కొడిప్యాక శ్రీనివాస్-సునీత దంపతుల 26వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా గురువారం బెల్లంపల్లి పట్టణంలోని కాంటా చౌరస్తాలో అన్నదానం నిర్వహించినట్లు ట్రస్ట్ వ్యవస్థాపకులు కాంపల్లి రాజేశ్వరి-శంకర్ తెలిపారు. శ్రీనివాస్-సునీత దంపతులు అందించిన ఆర్థిక సహకారంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు చెప్పారు. బెల్లంపల్లి పట్టణానికి వివిధ పనుల నిమిత్తం చుట్టుపక్కల గ్రామాల నుండి వచ్చిన ప్రజలు, విద్యార్థులు, ఆటో డ్రైవర్లు, ప్రయాణికులు, యాచకులకు అన్నదానం చేయడం జరిగిందని వివరించారు. అన్నదానాన్ని  స్వీకరించిన వారు ఈ సందర్భంగా శ్రీనివాస్ సునీత దంపతులు, బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఉదయాన్నే వివిధ పనుల నిమిత్తం గ్రామాల నుంచి పట్టణానికి వచ్చే మాలాంటి వారికి ఈ అన్నదానం కడుపు నింపి ఎంతగానో ఉపయోగపడిందని సంతోషం వ్యక్తం చేశారు. దాతలు ఎవరైనా ఉంటే బాయిజమ్మ సాయి సేవా ట్రస్టు ద్వారా అన్నదానం చేయవచ్చునని ఈ సందర్భంగా ట్రస్ట్ వ్యవస్థాపకులు తెలిపారు. ఆకలితో ఉన్న వారిని అతిథి సత్కారంతో ఆదరిద్దామని, అన్నదానంతో ఆకలి తీరుద్దామని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ మేనేజర్ బొద్దున సతీష్,జక్కం నాగమణి, కొంక రవి, దుర్గం మారుతీ, సాగాల సదానందం మోటపలుకుల తిరుపతి, శ్రీకాంత్, పనస రాజు సభ్యులు సేవకులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments