JSON Variables

కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేఖ విధానాలకు నిరసన

కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేఖ విధానాలకు నిరసన
గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ KCR గారి ఆదేశాల మేరకు గౌరవ బెల్లంపల్లి ఎమ్మెల్యే శ్రీ దుర్గం చిన్నయ్య గారి పిలుపు మేరకు బెల్లంపల్లి మండలం పోషమ్మగడ్డ దగ్గర కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేసి చావుడప్పుతో నిరసన తెలిపిన గౌరవ మంచిర్యాల జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ శ్రీ తొంగల సత్యనారాయణ గారు, గౌరవ బెల్లంపల్లి ఎంపీపీ శ్రీ గోమాస శ్రీనివాస్ గారు, గౌరవ బెల్లంపల్లి వైస్ ఎంపీపీ శ్రీమతి శ్రీ వెంబడి రాణి-సురేష్ గారు, గౌరవ బెల్లంపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీమతి శ్రీ గడ్డం కళ్యాణి-భీమగౌడ్ గారు, గౌరవ బెల్లంపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శ్రీ మోటపలుకుల రాజశేఖర్ గారు, గౌరవ మాజీ ఎంపీపీ, ఆకెనపల్లి ఎంపీటీసీ శ్రీ పొట్లపల్లి సుభాష్ రావు గారు ...
ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న BJP ప్రభుత్వం రైతు వ్యతిరేఖ విధానాలను అమలుచేస్తూ రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నదని, కేంద్రప్రభుత్వ మొండివైఖరి ఇలాగే కొనసాగితే రానున్నకాలంలో రైతులే దానికి తగిన బుద్ది చెపుతారని తెలిపారు ...
ఈ కార్యక్రమంలో మండల ఎంపీటీసీలు, సర్పంచ్లు, వార్డుసభ్యులు, కో ఆప్షన్ సభ్యులు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం డైరెక్టర్లు, ఇతర ప్రజాప్రతినిధులు, TRS నాయకులు మల్లేష్ గారు, TRS పార్టీ మరియు అనుబంధ కమిటీల అధ్యక్షులు, సభ్యులు, రైతులు, ప్రజలు, తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ...

Post a Comment

0 Comments