JSON Variables

దళిత సాహిత్య అకాడమీ జాతీయ అవార్డు గ్రహితకు సన్మానం

*దళిత సాహిత్య అకాడమీ జాతీయ అవార్డు గ్రహితకు సన్మానం*

 


మంచిర్యాల: సోమగూడెంకు చెందిన తెలంగాణ నేతకాని మహార్ కుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు, నేతకాని మహార్ సమన్వయ రాష్ట్ర కమిటీ సభ్యులు, దుర్గం గోపాల్ జాతీయ స్థాయిలో డా బీఆర్ అంబెడ్కర్ నేషనల్ ఫెలోషిప్ 2021అవార్డు న్యూ ఢిల్లీలో డిసెంబర్11న అందుకున్న సందర్భంగా ఆదివారం బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, దళిత సంఘాల నాయకులు ఆత్మీయ సన్మానం చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ మంచిర్యాల జిల్లా నుండి
దళిత సాహిత్య అకాడమీ జాతీయ అవార్డుకు ఎంపిక కావడం చాలా గర్వకారణం అన్నారు.
 అవార్డు గ్రహీత దుర్గం గోపాల్ మాట్లాడుతూ 
డాక్టర్ అంబేద్కర్ ఆశయ సాధనే లక్ష్యంగా, నిరుపేదల సంక్షేమమే ధ్యేయంగా నేతకాని మహార్, దళిత బహుజనుల ఆత్మగౌరవం కోసం నిరంతరం సమాజానికి సేవ చేయడం ఎంతో తృప్తినిస్తున్నదన్నారు. ఇలాంటి అరుదైన అవకాశం లభించడం ద్వారా మరింత బాధ్యత పెరిగిందన్నారు.
 బోర్లకుంటా ప్రభకర్ నేత,మేడ సమ్మయ్య, దాగం మల్లేశ్, రమాటేంకి శ్రీనివాస్ సర్పంచ్, పత్తి నవీన్,దుర్గం శ్రీనివాస్ పులి రాజారామ్, దళిత బహుజన పార్టీ అధ్యక్షుడు నిచ్చాకోళ్ల రామ్ చందర్, బత్తుల రాయలింగు మాల మహానాడు బెల్లపల్లి పట్టణ అధ్యక్షుడు,దుర్గం శేఖర్, తదితరులు పాల్గొన్నారు

Post a Comment

0 Comments