JSON Variables

బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నేడు న్యాక్ బృందం పర్యటన

బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నేడు న్యాక్ బృందం పర్యటన
న్యూస్ పవర్ రిపోట్టర్ సాయిరాం

- విద్యార్థులు, తల్లిదండ్రులు, పూర్వ విద్యార్థులు తరలిరావాలి
- ప్రిన్సిపాల్ ఎం. గోపాల్ 

*బెల్లంపల్లి:* బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గురు, శుక్ర వారాల్లో న్యాక్ బృందం పర్యటించనుంది. బెల్లంపల్లిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు అయ్యి 33 సంవత్సరాలు కావస్తుండగా మొట్టమొదటిసారిగా నేషనల్ అసెస్మెంట్ అక్రిడిటేషన్ కమిటీ (న్యాక్) గుర్తింపునకు కళాశాల వెళ్ళింది. ఇందులో భాగంగా దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన త్రిసభ్య కమిటీ గురువారం మరియు శుక్రవారం కళాశాలలో పర్యటించనుంది. కళాశాల స్థితిగతులు, తరగతులు, విద్య, ఉపాధి, వసతులు, ఆటలు తదితర అన్ని విభాగాలను ఈ బృందం పరిశీలించనుంది. ఇందుకుగాను బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల పూర్తి స్థాయిలో సన్నద్ధమైంది. న్యాక్ బృందం పరిశీలన అనంతరం కళాశాలకు వచ్చే గ్రేడు ఆధారంగా బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఉన్నత అభివృద్ధికి బాటలు పడనున్నాయని ప్రిన్సిపాల్ ఎం. గోపాల్ తెలిపారు. ఈ కార్యక్రమానికి హాజరు అయ్యేవారు అందరికీ భోజన తదితర వసతులను కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.
విద్యార్థులు, తల్లిదండ్రులు హాజరుకావాలి .

బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గురు, శుక్రవారాల్లో ఈ బృందం పర్యటన నేపథ్యంలో కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు ఈ కార్యక్రమానికి తప్పనిసరిగా హాజరు కావాలని ప్రిన్సిపాల్ ఎం. గోపాల్ కోరారు. కళాశాల అభివృద్ధికి పిల్లలు, తల్లిదండ్రులు సహకరించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

పూర్వ విద్యార్థులు తరలిరండి
బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చదివిన పూర్వ విద్యార్థులు ప్రస్తుతం వివిధ ఉద్యోగాల్లో, ఉన్నత స్థానాల్లో ఉన్నారని తెలిపారు. బృందం పర్యటన నేపథ్యంలో ఈ కళాశాలలో చదివిన పూర్వ విద్యార్థులు తరలివచ్చి కళాశాల కు మంచి గుర్తింపు రావడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

Post a Comment

0 Comments