*బెల్లంపల్లి నియోజకవర్గం*//-
*బెల్లంపల్లి నియోజకవర్గములోని 7 మండలలలో రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా జరిగిన ధర్నాలో పాల్గొన్న *బెల్లంపల్లి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత గౌరవ డైనమిక్ MLA శ్రీ దుర్గం చిన్నయ్య గారు
*నియోజకవర్గంలొ 7 మండలాల్లో ర్యాలీ నిర్వహించి, కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.*
*ఈ సందర్భంగా జరిగిన నిరసన కార్యక్రమాల్లో గౌరవ MLA శ్రీ దుర్గం చిన్నయ్య గారు మాట్లాడుతూ....*
*తెలంగాణ రాష్ట్ర రైతుల మీద కక్ష కట్టిన కేంద్రం ప్రభుత్వ వైఖరికి నిరసనగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతాం.*
*కేంద్రం యాసంగి లో పంట కొనుగోలు చేయమని పార్లమెంట్ సాక్షిగా ప్రకటించి,తెలంగాణ రైతులకు నట్టేట ముంచుతుంది.*
*రైతులు యాసంగి లో వరి కి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేసి నష్టపోకుండా ఉండాలి.*
*ఇప్పటికే 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు చేసింది,మరో 30 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం రైతుల వద్ద ఉంది.కేంద్రం మాత్రం ఇప్పటి వరకు తీసుకుంది నామమాత్రమే.*
*బీజేపీ నేతలు ఢిల్లీలో ఒక లాగా, గల్లీలో మరోలాగా మాట్లాడుతున్నారు.తెలంగాణ రైతుల కోసం పూర్తి ధాన్యం కొనుగోలు చేసేలా ముందు కేంద్రాన్ని ఒప్పించాలి.. లేదంటే బీజేపీ కి తెలంగాణ లో స్థానం లేకుండా తెలంగాణ ప్రజలు,రైతులు చేస్తారు.*
*రైతులకు అండగా దేశ చరిత్రలో ధర్నా చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాత్రమే..తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు ప్రభుత్వం.*
*ఇప్పటికే మొదటి పంటకు ఇబ్బంది పెడుతూ,రెండవ పంట కొనమని అంటున్న బీజేపీ ప్రభుత్వ వైఖరిని ఎక్కడిక్కడ ప్రశ్నంచి నిలదిద్దాం.*
*తెలంగాణ లో రైతన్నకు పంట పెట్టుబడి సహాయంగా ఎకరాకు 10 వేలు ఇస్తూ,ఏటా 14 వేల కోట్లు రైతు బంధు నిధులు విడుదల చేస్తున్న ప్రభుత్వం.*
*ఇప్పటి వరకు 50 వేల కోట్లు రైతులకు రైతు బంధు ద్వారా అందజేయడం జరిగింది.*
*పంట సహాయం పై రైతు కు భరోసా తో పాటు,24 గంటల ఉచిత విద్యుత్, నాణ్యమైన విత్తనాలు,ఎరువులు అందిస్తూ,నకిలీ విత్తనాలు అమ్మే వారిపై పిడి యాక్ట్ పెట్టి,పంట కొనుగోలు చేస్తూ ప్రభుత్వం అండగా ఉన్నది.*
*అందువల్లనే నేడు తెలంగాణ లో సాగు విస్తీర్ణం పెరిగింది.తెలంగాణ రాకముందు గతంలో 5 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం పండితే,ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో నేడు 5 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండింది.*
*రాష్ట్రంలో గతంలో కోటి 40లక్షల మెట్రిక్ టన్నుల పండితే, నేడు రెండు కోట్ల 3లక్ష ల మెట్రిక్ టన్నుల ధాన్యం పండింది అంటే రైతుకు ప్రభుత్వం అందిస్తున్న సంపూర్ణ సహకారం మాత్రమే అని అందరూ గుర్తు పెట్టుకోవాలి.*
*ఈ కార్యక్రమంలొ గ్రంధాలయ చైర్మన్ రేణికుంట్ల ప్రవీణ్ గారు, గౌరవ ZP వైస్ చైర్మన్ శ్రీ తొంగల సత్యనారాయణ గారు, గౌరవ MPP శ్రీ గోమాస శ్రీనివాస్ గారు,గౌరవ మున్సిపాల్ చైర్మన్ జక్కుల శ్వేతా-శ్రీధర్ గారు,గౌరవ మున్సిపాల్ వైస్ చైర్మన్ శ్రీ బత్తుల సుదర్శన్ గారు,గౌరవ మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డం కళ్యాణి-బీమాగౌడ్ గారు,గౌరవ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శ్రీ మోట పలుకుల రాజశేఖర్ గారు,కౌన్సిలర్లు,7 మండలాల MPTC లు, సర్పంచ్లు ఇతర ప్రజాప్రతినిధులు అందరు పాల్గొన్నారు*
0 Comments