JSON Variables

ఎల్లారెడ్డిపేట లో టీఆర్ఎస్ శ్రేణుల సంబరాలు

ఎల్లారెడ్డిపేట లో టీఆర్ఎస్ శ్రేణుల సంబరాలు
NEWSPOWER REPORTER:Babu
  రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోనీ పాత బస్టాండ్ లో సోమవారం  తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా ముఖ్య మంత్రి కెసిఆర్  తొమ్మిదో సారి ఎన్నికైన శుభ సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ బండారి బాల్ రెడ్డి ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు.  ఎల్లారెడ్డిపేట పాత బస్టాండ్ లో టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సోమవారం టాపాసులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమం సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ టౌన్ ప్రసిడెంట్ బండారి బాల్ రెడ్డి. మాట్లాడుతూ బంగారు తెలంగాణ నిర్మాత టిఆర్ఎస్  పార్టీ వ్వవస్థాపక అద్యక్షులు  కెసిఆర్ టిఆర్ఎస్ పార్టీ నీ స్థాపించి  20 సంవత్సరాలు పూర్తి అయిన శుభ సందర్భంగా  ప్రజలకు టీఆర్ఎస్ పార్టీ నాయకులకు  కార్యకర్తలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.   పలు సంక్షేమ పథకాలు
ప్రవేశపెట్టి  సభండ వర్గాల ప్రజలకు దగ్గరైన  దేశంలోనీ  ఏకైక ముఖ్యమంత్రి  కెసిఆర్ అని ఆయన అన్నారు.    ఈ సంభరాల  కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మహిళా మండల అధ్యక్షురాలు అప్సరున్నీస్సా, టిఆర్ఎస్ పార్టీ మండల యూత్ అధ్యక్షులు ఎడ్ల లక్ష్మన్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు ఎడ్ల సందీప్ టిఆర్ఎస్ పార్టీ నాయకులు  నంది కిషన్ , శ్యామంతుల అనిల్,  పోరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, పొందుర్తి ఉమేష్, సోమారపు శరవింద్, ఊషి సునీల్ , పసుల అంజయ్య ,గ్రామ శాఖ టీఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షులు నేవూరి నవజీవన్ రెడ్డి , టిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ యూత్ అధ్యక్షులు దొనుకుల కళ్యాణ్ ,టిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ మహిళా అధ్యక్షురాలు  శ్యామ మంజుల, మేగి నరసయ్య ,దుమాల గ్రామ శాఖ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బట్టు రాజు, వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ సిరిపురం రాజి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments