రైతులకు అన్ని సౌకర్యాలు కల్పించడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందు ఉంది
టిఆర్ఎస్ జిల్లా ఇంచార్జ్ తోట ఆగయ్య
గోదాం కు భూమి పూజ
ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామ శివారులో నాబార్డు వారు మంజూరు చేసిన 36 లక్షల రూపాయల వ్యేయంతో నిర్మించనున్న గోదాంకు టిఆర్ఎస్ పార్టీ జిల్లా ఇన్చార్జీ తోట ఆగయ్య, ఎల్లారెడ్డిపేట సింగిల్ విండో అద్యక్షులు గుండారాపు కృష్ణారెడ్డి లు గురువారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతుల పక్షపాతి ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు. రైతుల కోసం అన్ని సౌకర్యాలు కల్పించడంలో అన్ని రాష్ట్రల కంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందంజలో ఉందన్నారు. రైతులు ఆరుగాలం కష్టించి పండించిన ధాన్యాన్ని పాడైపోకుండా నిలువ చేసుకోవడానికి దళారులను నమ్మి మోసపోకుండా ప్రభుత్వం మద్దతు ధరలకు అమ్ముకోవడానికి రైతులకు సకాలంలో ఎరువులను, విత్తనాలను అందుబాటులో అందజేయడానికి గోదాములు ఎంతో ఉపయోగపడతాయన్నారు. గోదామును రైతులు అందరు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ పి పిల్లా రేణుక, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కృష్ణ హరి, కరీంనగర్ ఉమ్మడి జిల్లా సింగిల్విండో అధ్యక్షులు ఫోరం జిల్లా అధ్యక్షులు తీపి రెడ్డి కిషన్ రెడ్డి, ఏ ఏం సి చైర్మన్ కొండ రమేష్, సర్పంచులు, ఎంపీటీసీలు, టిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
0 Comments