JSON Variables

నరేంద్ర మోదీ చిత్ర పటానికి పాలాభిషేకం

నరేంద్ర  మోదీ చిత్ర పటానికి పాలాభిషేకం 
NEWSPOWER REPORTER:saireddy
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల బీజేపీ పార్టీ కార్యాలయంలో  పత్రికేయుల సమావేశంలో బెంద్రం తిరుపతిరెడ్డి బీజేపీ మండల అధ్యక్షులు  మాట్లాడతూ  భారతదేశ ప్రధానమంత్రి గౌరవ శ్రీ నరేంద్ర మోదీ గారు మన దేశంలో 100 కోట్ల మంది ప్రజలకి  కరోనా  టీకా (వ్యాక్సిన్ ) ఉచితంగా అందించినందుకు,మరియు మోదీ గారు ఉచితంగా  ఇచ్చిన టీకా వేసుకున్న ప్రజలందరికి  హృదయ పూర్వక కృతజ్ఞతలు,190 దేశాలలో 128 దేశాలకు కరోనా వ్యాక్సిన్ టీకా మందును సప్లై చేశారు, ప్రపంచంలో  ఇతర దేశాలకు చేతులు చాపే స్థితి నుండి మన దేశానికీ చేతులు చాపే పరిస్థితి తీసుకొచ్చిన గౌరవ మోదీ గారికి ఇల్లంతకుంట మండల ప్రజల తరుపున పాదాభివందనం చేస్తున్నామన్నారు,రేపు కరోనా వ్యాక్సిన్ టీకా కేంద్రలలో  మోదీ గారి చిత్ర పటానికి పాలాభిషేకం చేసి, వైద్య సిబ్బంది కి సన్మానం కార్యక్రమలు చేయనున్నామన్నారు, ఈ పత్రికేయ సమావేశంలో  జిల్లా బీజేపీ అధికారప్రాతినిధి కొత్త శ్రీనివాస్రెడ్డి, జిల్లా బీజేవైఎం ఉపాధ్యక్షులు బొల్లారం ప్రసన్న, మండల ఉపాధ్యక్షులు బోయిని రంజిత్,పున్ని సంపత్,ప్రధానకార్యదర్శులు నాగసముద్రాల సంతోష్, బత్తిని స్వామి, బీజేవైఎం అధ్యక్షులు బండారి రాజ్, పట్టణ అధ్యక్షులు తిప్పారపు శ్రవణ్, ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి వజ్జపేల్లి శ్రీకాంత్, చుక్క రమేష్ తదితరులు పాలుగోన్నారు.

Post a Comment

0 Comments