JSON Variables

వికలాంగుల భవనాన్ని వెంటనే పూర్తి చేయాలి


 
వికలాంగుల భవనాన్ని వెంటనే పూర్తి చేయాలి
కోహెడ మండల వెన్నెల  వికలాంగుల సమాఖ్య నేతలు గౌరవ కోహెడ సర్పంచ్, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షురాలు పేర్యాల నవ్యదేవేందర్ రావు గారిని కలిసి గతంలో తమ వికలాంగుల సమాఖ్య కార్యాలయ భవనం తమకు మంజూరీ అయినప్పటికీ బేస్మెంట్ లెవల్ పనులు పూర్తి అయిన తరువాత నిధులు సరిపోక పోవడంతో భవన నిర్మాణం అర్ధాంతరంగా నిలిచిపోయిందని కావున ప్రభుత్వం ద్వారా నిధులు మంజూరీ చేయించి భవన నిర్మాణాన్ని పూర్తి చేయించేందుకు సహకరించాలని కోరుతూ సర్పంచ్ గారికి వినతి పత్రాన్ని సమర్పించారు.

ఈ సందర్భంగా గౌరవ సర్పంచ్ నవ్యగారు మాట్లాడుతూ.. బేస్మెంట్ వరకు పూర్తయి అర్ధాంతరంగా నిలిచిపోయిన వికలాంగుల సమాఖ్య కార్యాలయ భవన నిర్మాణం అంశాన్ని గౌరవ ఎమ్మెల్యే సతీష్ బాబు, గౌరవ మంత్రివర్యులు హరీష్ రావు గారి దృష్టికి తీసుకుపోయి భవన నిర్మాణం పూర్తి చేయించేందుకు ప్రభుత్వం ద్వారా నిధులు మంజూరీ చేయించేందుకు తప్పకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా తమ సమస్యల పరిష్కారం కోసం సానుకూలంగా స్పందించిన సర్పంచ్ గారికి వికలాంగుల నేతలు ధన్యవాదాలు తెలియజేసారు.

ఈ కార్యక్రమంలో కోహెడ PACS చైర్మన్ పేర్యాల దేవేందర్ రావు గారు, పంచాయతీ పాలకవర్గ సభ్యులు వేల్పుల వెంకటస్వామి, గంగవ్వ, కోహెడ పాల కేంద్రం చైర్మన్ పేర్యాల నరేందర్ రావు మరియు వికలాంగుల సమాఖ్య నేతలు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments