JSON Variables

రైతులఇబ్బందులను తీర్చండి

రైతులఇబ్బందులను తీర్చండి
NEWSPOWER REPORTER:Babu
 ఎల్లారెడ్డిపేట మండలంలోని వివిధ గ్రామాలలో వడ్లను కొనుగోలు చేసి రైతుల ఇబ్బందులను తీర్చాలని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాట నరసయ్య శుక్రవారం విలేకర్ల సమావేశంలో డిమాండ్ చేశారు. మండలంలోని వివిధ గ్రామాలలో ఐకేపీ సెంటర్లు సహకార సంఘాలు ఇప్పటివరకు ఎక్కడ కూడా ప్రారంభించ లేదన్నారు. ఇప్పటికైనా కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలన్నారు. గత వారం రోజుల నుండి రైతులు రహదారులపై కుప్పలు పోసి టార్పాలిన్లు కప్పి ఉంచడం జరిగిందన్నారు. అకాల వర్షాలకు వడ్లు తడిసిపోయి రైతులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని అన్నారు. వడ్లు కొనుగోలు చేసి రైతులకు డబ్బులను వారి ఖాతాలో సకాలంలో అందించాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షులు మర్రి శ్రీనివాస్ రెడ్డి, మండల ఉపాధ్యక్షులు గండికోట రవి, దేవయ్య, శివరాత్రి రాజు, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments