ఐకెపి వడ్ల కొనుగోలు కేంద్రాలకు టార్పాలిన్ ఎలక్ట్రానిక్ తేమశాతం యంత్రాలను అందజేసిన ఏఎంసి అధ్యక్షులు కొండ రమేష్ గౌడ్
ఎల్లారెడ్డిపేట్ మండలం అల్మాస్ పూర్ ప్యాక్స్ బండలింగంపల్లి గ్రామ ఐకేపీ వడ్ల కొనుగోలు కేంద్రాలకు వానకాలం సీజన్ 2020-21 భాగంగా రైతుల సౌకర్యార్థం టార్పాలిన్స్ ఎలక్ట్రానిక్ స్కేల్ పాడి క్లీనర్స్ , తేమ శాతం యంత్రం మొదలగు వస్తువులను వ్యవసాయ మార్కెట్ కమిటీ రాచర్ల బొప్పాపూర్ కార్యాలయములో అధ్యక్షులు శ్రీ కొండ రమేష్ గౌడ్
అందజేయడం జరిగింది.
వారు మాట్లాడుతూ రైతులు తమ పండించిన పంటను ప్రభుత్వం కొనుగోలు సెంటర్లలు ఉంటాయో లేవో అనే ఆలోచనలో ఉన్న సమయంలో మేము సైతం ఉన్నాము అంటూ వెంటనే కొనుగోలు సెంటర్లలు ప్రారంభించలని కోరిన గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కు హృదయ పూర్వక అభినందనలు తెలుపుతూ అలాగే ఎల్లారెడ్డిపేట్ మరియు వీర్నపెల్లి మండలలోని రైతులకు కొనుగోలు సెంటర్లలో ఇబ్బందులు తలెత్తకుండా చూడవలిసిన బాధ్యత మా మీద నమ్మకం తో ఇంత పెద్ద బాధ్యతను అప్పగించిన గౌరవ ఐ. టి, మున్సిపల్ శాఖ మంత్రివర్యులు కల్వకుంట్ల తారక రామారావు గారికి కృతజ్ఞతలు తెలిపారు. రెండు మండలంలో ఐకేపీ మరియు ప్యాక్స్ కొనుగోలు సెంటర్లు కు సంబంధించిన పరికరాలను బొప్పాపూర్ మార్కెట్ కమిటీ కార్యాలయంలో సిద్ధముగా ఉంచామని తెలుపుతూ రైతులు తాము పండించిన పంటకు కనీస మద్దతు ధర ఏ గ్రేడ్ 1960 సాధారణ రకం 1940 ఉన్నాయి అని రైతులు గమనించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐకేపీ మరియు ప్యాక్స్ సెంటర్లు ఇంచార్జిలు మరియు మార్కెట్ కమిటీ కార్యదర్శి సిబ్బంది పాల్గొన్నారు.
0 Comments