JSON Variables

కేంద్ర ప్రభుత్వం కాదన్న రైతుల ధాన్యం కొనుగోలు చేస్తానన్న కెసిఆర్ గారికి రైతుల పక్షాన ధన్యవాదాలు తెలిపిన తెరాస మండల నాయకులు

కేంద్ర ప్రభుత్వం కాదన్న రైతుల ధాన్యం కొనుగోలు చేస్తానన్న కెసిఆర్ గారికి రైతుల పక్షాన ధన్యవాదాలు తెలిపిన తెరాస మండల  నాయకులు
యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు ఎం మండల కేంద్రంలోని టిఆర్ఎస్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో కేంద్ర ప్రభుత్వం రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయలేమని తెగేసి చెప్పిన కానీ.... తెలంగాణ రాష్ట్ర రైతుల పక్షపాతి అయిన ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు తెలంగాణ రైతుల పక్షాన నిలబడి కచ్చితంగా వరిధాన్యం కొనుగోలు చేస్తామని భరోసా కల్పించి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినందుకు రైతుల పక్షాన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు బీసు.చందర్ గౌడ్, రైతు సమన్వయ సమితి జిల్లా డైరెక్టర్ కోరె.బిక్షపతి, మండల కోఆర్డినేటర్ యాస ఇంద్రారెడ్డి ,గ్రామ శాఖ అధ్యక్షుడు కోరె. వెంకన్న ,రైతు సమన్వయ సమితి గ్రామ కోఆర్డినేటర్లు నాతి. స్వామి గౌడ్ ,నాతి రాజు గౌడ్, TRSKVమండల సెక్రెటరీ జనరల్ కదిరె.నవీన్ ,ఎస్ఎంసి చైర్మన్ కోరే. బీరప్ప ,మండల నాయకులు ఎలేంధర్ ,రాంబాబు ,లింగయ్య, కనకయ్య, తదితరులు పాల్గొన్నారు

Post a Comment

0 Comments