JSON Variables

ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో గంజాయి అమ్ముతున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు


ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో గంజాయి అమ్ముతున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఎస్సై వెంకటకృష్ణ తన సిబ్బందితో పెట్రోలింగ్ డ్యూటీ నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన బండలింగంపల్లి కి చెందిన వ్యక్తిని తనిఖీ చేయగా అతని వద్ద నుండి 250 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. గంజాయి విక్రయదారుడు నిజాంబాద్ జిల్లా నుండి తక్కువ ధరకు కొనుగోలు చేసి ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో గంజాయిని విక్రయిస్తున్నట్లు తెలిపారు. గంజాయి విక్రయదారుడు పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Post a Comment

0 Comments