JSON Variables

మాన్యవర్ కాన్షీరాం గారి బాటలో నడుద్దాంతెలంగాణలో బహజన రాజ్యాధికారం సాధిద్దాం

మాన్యవర్ కాన్షీరాం గారి బాటలో నడుద్దాం
తెలంగాణలో బహజన రాజ్యాధికారం సాధిద్దాం
News power reporter:ఆర్ బి  చారి
 కోహెడ మండల కేంద్రంలో బహుజన రాజ్యాధికార సిద్దాంతకర్త, బహుజన్ సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు మాన్యవర్ కాన్షీరాం గారి వర్దంతి కార్యక్రమం బీఎస్పీ కోహెడ మండల కన్వీనర్‌ చెప్యాల శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో నిర్వహించగా ముఖ్య అతిథిగా జిల్లా ట్రెజరర్ గూండ్ర రమేష్ గారు హాజరైనారు. 
ఈ కార్యక్రమంలో భాగంగా కాన్షీరాం గారి చిత్ర పటానికి పూల మాల వేసి నాయకులందరూ నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా జిల్లా ట్రెజరర్ రమేష్ గారు మాట్లాడుతూ బహుజన రాజ్యాధికార సిద్దాంతకర్త, బహుజన్ సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు మాన్యవర్ కాన్షీరాం గారు బాబాసాహెబ్ అంబేడ్కర్ గారి ప్రధాన ఆశయమైన రాజకీయ అధికారాన్ని సాధిచడం కోసం DS4, బీఎస్పీనీ స్థాపించి భారత దేశాన్ని పరిపాలించడమే అంతిమ లక్ష్యంగా పనిచేసి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో నాలుగు సార్లు బహెన్ కుమారి మాయావతి గారిని ముఖ్యమంత్రిని చేయడం ద్వారా దేశ బహుజనులకు రాజ్యాధికార రుచిని చూపించి ఓటు అనే ఆయుధాన్ని ఉపయోగించడంలో బహుజనులను చైతన్యం పరిస్తే ఖచ్చితంగా భారత దేశ రాజ్య పీఠాన్ని కైవసం చేసుకొని పరిపాలకులం కాగలమని నిరూపించిన మహా యోధులు మాన్యవర్ కాన్షీరాం గారని ఆయన పని విధానంతో ముందుకు సాగుతూ తెలంగాణ రాష్ట్రములో, హుస్నాబాద్ నియోజకవర్గంలో బహుజన రాజ్యం సాధించే వరకు అలుపెరుగకుండా ప్రతి ఒక్క కార్యకర్త శక్తివంచన లేకుండా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పొన్నాల అశోక్, జీడి శేఖర్, తగరపు అశోక్, ఎనగందుల అనిల్, బర్రె సదానందం, ఎండీ షాదుల్లా, చుంచు రంజిత్ కుమార్,తదితరులు పాల్గొని విజయవంతం చేసినారు.

ఇట్లు
చెప్యాల శ్రీనివాస్ బీఎస్పీ కోహెడ మండల కన్వీనర్‌.

Post a Comment

0 Comments