మరొకసారి కుంగిన బ్రిడ్జ్
సిద్దిపేట జిల్లా కోహెడ మండలం తంగళ్ళపల్లి గ్రామంలో ఈ రోజు తంగళ్ళపల్లి నుండి శనిగరం వెళ్లే రహదారిలో పిల్ల వాగు బ్రిడ్జి మరొకమారు మరొక చోట కూలిపోవడం జరిగింది పండగ పూట ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్పందించి గ్రామ సర్పంచ్ గారు శ్రీమతి పాము నాగేశ్వరి శ్రీకాంత్ వారి ఆధ్వర్యంలో తాత్కాలిక మరమ్మతులు నిమిత్తం ట్రాక్టర్ల ద్వారా మొరం పోసి ప్రయాణికులకు రాకపోకలు కల్పించిన గ్రామపంచాయతీ పాలకవర్గం అక్కడ సేవాభావంతో పాల్గొన్న యువతకు ప్రయాణికులు వాహన దారులు ధన్యవాదములు తెలియచేసారు.గమనిక: బ్రిడ్జి శిథలవస్తాలో ఉన్నందున భారీ వాహనాల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేయడం జరిగింది దయచేసి అందరూ సహకరించగలరని కోరారు.
0 Comments