భారత్ రికార్డ్.. 100కోట్లు దాటిన టీకా డోసుల పంపిణీ..!
కరోనా మహమ్మారిని అరికట్టేందుకు భారత్ చేపట్టిన టీకా ఉద్యమం నేడు 100 కోట్ల మైలురాయిని దాటి అరుదైన ఘనత సాధించింది. వ్యాక్సినేషన్ ప్రారంభమైనప్పటి నుంచి గురువారం ఉదయం 10 గంటల వరకు 100 కోట్ల వ్యాక్సిన్ డోసులను ప్రజలకు ఇచ్చారు. ఇది అమెరికాలో ఇచ్చిన వ్యాక్సిన్ డోసుల కన్నా రెట్టింపు, జపాన్లో కన్నా ఐదు రెట్లు, జర్మనీలో కన్నా తొమ్మిది రెట్లు, ఫ్రాన్స్లో కన్నా 10 రెట్లు అధికం.
ఇట్టి కార్యక్రమాన్ని పురస్కరంచుకుని కమలపూర్ మండలం, గుండేడు గ్రామంలో విదులు నిర్వహిస్తున్న వైద్య సిబ్బందికి సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షులు నలగామ శ్రీనివాస్ మరియు బెజ్జం కి మండల అధ్యక్షులు దోనె అశోక్ లు శాలువాలతో సన్మానించడం జరిగింది.
0 Comments